తిరుమలలో 87,081 మందికి శ్రీవారి దర్శనం
తిరుమల ముచ్చట్లు:
తిరుమల శ్రీవారిని ఆదివారంఉదయం వరకు 87,081 మంది దర్శించుకున్నట్లు ఈవో ధర్మారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో స్వామివారికి తలనీలాలు సమర్పించిన వారు 41,575 మంది ఉన్నారు. స్వామివారి ఆదాయం రూ.4.05 కోట్లు లభించిందని పేర్కొన్నారు. స్వామివారి దర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
Tags: 87,081 people had darshan of Srivari in Tirumala