Natyam ad

మళ్లీ కట్టెల పోయిన మీద వంట చేసుకోవాలా- మన్నె గోవర్ధన్ రెడ్డి

బంజారాహిల్స్ ముచ్చట్లు:



నానాటికి పెరుగుతున్న గ్యాస్ ధరలు సామాన్యుల బతుకులను చిద్రం చేస్తున్నాయని బీఆర్ఎస్ నాయకులు మన్నె గోవర్ధన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ వద్ద పెంచిన సిలిండర్లకు నిరసనగా ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 2014లో అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం 400 ఉన్న గ్యాస్ సిలిండర్ను 1200 కు పెంచిన ఆగ్రహం చేశారు. ఇలా పెరిగిన ధరల కారణంగా పేద మధ్యతరగతి ప్రజలు జీవనం కొనసాగించడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశాన్ని దేశ ప్రజలను ఉన్నతంగా తీర్చిదిస్తారని భావించిన మోడీ సర్కారు అన్ని రంగాలలో వెనుక పడతానని అనుభవిస్తూ దేశ ప్రజలపై మోయలేని భారాన్ని మోపుతుందని మండిపడ్డారు.  పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరతో పాటు నిత్యవసర వస్తువులు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుండడంతో బతకడం కష్టంగా మారుతుందని మహిళా ఆవేదన వ్యక్తం చేసింది. పిల్లల చదువులు అనారోగ్య సమస్యలు ఇంటి అద్దెలు ఏది చెల్లించాలో అర్థం కాని దుస్థితిలో జీవనం కొనసాగిస్తున్నామని విచారం వ్యక్తం చేసింది.

 

Tags; Manne Govardhan Reddy should cook again when the firewood is gone

Post Midle
Post Midle