రైస్ మిల్లుసై అధికారుల దాడి..అక్రమ ధాన్యం గుర్తింపు
గుంటూరు ముచ్చట్లు:
గుంటూరు జిల్లా తాడేపల్లి వడ్డేశ్వరం కే.ఎల్.యు రోడ్డులోని కనకదుర్గా రైస్ మిల్లులో సివిల్ సప్లై అధికారులు దాడులు నిర్వహించారు. రైస్ మిల్లులో గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా ధాన్యం నిలువను గుర్తించారు. 1600 వందల ధాన్యం బస్తాలు అక్రమంగా నిల్వ ఉంచినట్లు నిర్దారించారు. నిల్వ ఉంచిన ధాన్యానికి రైస్ మిల్ యాజమాన్యం లెక్కలు చూపలేదు. నిల్వ ఉంచిన ధాన్యానికి లెక్కలు చూపేందుకు రైస్ మిల్లు యాజమాన్యం రేపటి వరకు సమయం కోరినట్లు సమాచారం. ధాన్యం నిలువ ఉంచిన రైస్ మిల్లుకు సివిల్ సప్లై అధికారులు తాళాలు వేసారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్మోహన్రెడ్డి -ఎంపిపి భాస్కర్రెడ్డి
Tags: Officers raid rice mills and identify illegal grain