రామాయంపేట పట్టణంలో ఘనంగా వైకుంఠ ఏకాదశి మహోత్సవ వేడుకలు
మెదక్ ముచ్చట్లు:
మెదక్ జిల్లా రామాయంపేట లోని శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తులు స్వామి వారిని ఉత్తర ద్వారము
గుండా దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలను పురవీధుల గుండా మేళతారాలతో భజనలతో ఊరేగింపు చేసి
భక్తులకు దర్శనం కల్పించారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు పబ్బ సత్యనారాయణ ఆలయ కమిటీ సభ్యులు మరియు రామాయంపేట చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో
భక్తులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Tags: Vaikuntha Ekadashi mahotsava celebrations in Ramayampeta town