Natyam ad

పెళ్లింట విషాదం

మెదక్ ముచ్చట్లు:

మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధి రావెల్లి గ్రామంలో పెళ్లి శుభకార్యం జరగాల్సిన ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. తూప్రాన్ మున్సిపాలిటీ పెద్ద చెరువులో తన తోటి స్నేహితులతో కలిసి సరదాగా స్నానానికి వెళ్లిన వ్యక్తి గల్లంతయ్యాడు
తూప్రాన్ మున్సిపాలిటీ పరిధి లోని రావెల్లి గ్రామానికి చెందిన చాకలి తంగేళ్ల లక్ష్మణ్ (22) తన చెల్లెలు పెళ్లి రెండు రోజుల్లో ఉన్నదని తెలుసుకొని హైదరాబాద్ వైన్ షాప్ లో పనిచేస్తున్న ఇతను స్వగ్రామానికి వచ్చాడు అనంతరం తన తోటి మిత్రులతో కలిసి తూప్రాన్ మున్సిపాలిటీ పెద్ద చెరువులో సరదాగా స్నానానికి అని వెళ్లి గల్లంతయ్యాడు విషయం తెలుసుకున్న కుటుంబీకులు బంధువులు చెరువు వద్దకు వచ్చి బోరున విలపిస్తున్నారు. శుభకార్యం జరగాల్సిన ఇంట్లో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకోవడంతో కుటుంబీకులు బంధువులు గ్రామస్తులు బోరుణ వినిపిస్తున్నారు. నీటిలో గల్లంతైన లక్ష్మణ్ తన తోటి స్నేహితులతో కలిసి మద్యం సేవించి చెరువులో దిగినట్లు తన మిత్రులు చెబుతున్నారు. తూప్రాన్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు…

Post Midle

Tags: Wedding tragedy

Post Midle