శాస్త్రోక్తంగా వైకుంఠ ద్వాదశి చక్రస్నానం
తిరుమల ముచ్చట్లు:
తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఉదయం శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. ముందుగా శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్ను శ్రీవారి ఆలయం నుండి శ్రీ భూవరాహస్వామివారి ఆలయానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. శ్రీవారి పుష్కరిణిలో ఉదయం 5 నుండి 6 గంటల నడుమ స్నపన తిరుమంజనం, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్ల చక్రస్నాన మహోత్సవం వైభవంగా చేపట్టారు.శ్రీస్వామి పుష్కరిణి తీర్థంలో చక్రస్నాన సుముహూర్తాన స్నానమాచరించిన వారికి తిరుమల శేషగిరులలో వెలసివున్న 66 కోట్ల పుణ్యతీర్థ స్నానఫలం దక్కుతుందని పురాణాల ప్రాశస్త్యం.ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి దంపతులు, సివిఎస్వో గోపినాథ్ జెట్టి దంపతులు, ఆలయ డెప్యూటీ ఈవో రమేష్బాబు, విజివో బాలిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్రెడ్డి ఆకాంక్ష
Tags: Scientifically Vaikuntha Dvadrishi Chakrasnanam