Natyam ad

అమెరికా కాల్పుల్లో తెలుగు యువతి మృతి

ఎల్బీనగర్ ముచ్చట్లు:

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం సృష్టించింది. టెక్సాస్ రాష్ట్రం అలెన్ పట్టణంలో ఓ మాల్లో జరిగిన కాల్పుల్లో 8 మంది చనిపోయారు. ఈ ఘటనలో 27 ఏళ్ల తెలుగు యువతి ప్రాణాలు కోల్పోయింది. హైదరాబాద్లోని సరూర్నగర్కు చెందిన తాటికొండ ఐశ్వర్య రెడ్డి దుండగుల తూటాలకు బలైంది. ఐశ్వర్య పర్ ఫెక్ట్ జనరల్ కాంట్రాక్టర్స్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఈమె తండ్రి పేరు నర్సిరెడ్డి. రంగారెడ్డి జిల్లా కోర్టులో జడ్జిగా పనిచేస్తున్నారు. కూతురు మరణవార్త తెలిసి శోకసంద్రంలో మునిగిపోయారు. అమెరికాలో స్థిరపడిన అమ్మాయి ఇలా దుండగుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోవడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

 

Tags: A young Telugu woman died in American firing