Natyam ad

మన్యంలో బంద్

అల్లూరి ముచ్చట్లు:

అల్లూరి మన్యంలో బంద్ కొనసాగుతోంది.పాడేరులో ఎర్రవరం హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పలు గిరిజన సంఘాలు బంద్ కు పిలుపునిచ్చాయి.దీంతో ప్రముఖ పర్యటక కేంద్రమైన లంబసింగిలో మన్యం బంద్ ను చేపట్టారు.ఈ క్రమంలో ప్రజా సంఘాల నేతలు, గిరిజనులు రోడ్డుపైకి వచ్చి బైఠాయించి ఆందోళన వ్యక్తొం చేశారు.హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని గిరిజనులు నినాదాలు చేశారు.బంద్ నేపద్యంలో పోలీసులు ఎక్కడ ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు  జరగకుండా చర్యలు చేపట్టారు.అదానీ సంస్థకు ప్రయోజనం చేకూర్చడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల జీవితాలను నాశనం చేస్తున్నాయని విమర్శించారు.తక్షణమే ఈ ప్రాజెక్టును నిలిపివెయ్యాలని డిమాండ్ చేశారు.

 

Tags: Bandh in Manyam

Post Midle
Post Midle