Natyam ad

తిరుమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ

– భక్తుల సర్వదర్శనానికి 10గంటల సమయం

 

తిరుమల ముచ్చట్లు:

Post Midle

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 4 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది.తిరుమల శ్రీవారిని నిన్న 77వేల 511 మంది భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.ఇక రేపు శ్రీవారి ఆలయంలో శ్రీరామ నవమి వేడుకలు నిర్వహించనున్నారు. రేపు రాత్రి 7 గంటలకు హనుమంత వాహనంపై మలయప్పస్వామి ఊరేగనున్నారు. ఈ నేఫథ్యంలో శ్రీవారి ఆలయంలో పలు ఆర్జిత సేవలు రద్దు చేసింది టీటీడీ. ఎల్లుండి శ్రీవారి ఆలయంలో శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించనున్నారు.

 

Tags: Continuity of devotees in Tirumala

Post Midle