నిమ్మకూరులో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు
విజయవాడ ముచ్చట్లు:
కృష్ణాజిల్లా నిమ్మకూరులో పండుగ వాతావరణం నెలకొంది. గురువారం నాడు నిమ్మకూరులో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల ప్రారంభోత్సవం జరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్టీఆర్, బసవతారకం చిత్రపటాలకు నివాళులు అర్పించారు. నిమ్మకూరు వాసులతో చంద్రబాబు ఆత్మీయ సమావేశం అయ్యారు.చంద్రబాబుకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు రామకృష్ణ, సుహాసిని నూతన వస్త్రాలు అందించారు.
Tags; NTR centenary celebrations in Nimmakuru