తిరుమలలో 58,690మందికి శ్రీవారి దర్శనం
తిరుమల ముచ్చట్లు:
తిరుమల శ్రీవారిని గురువారం ఉదయం వరకు 58,690 మంది దర్శించుకున్నట్లు ఈవో ధర్మారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో స్వామివారికి తలనీలాలు సమర్పించిన వారు 20,744 మంది ఉన్నారు. స్వామివారి ఆదాయం రూ. 3.02కోట్లు లభించిందని పేర్కొన్నారు. స్వామివారి దర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
Tags:58,690 people had darshan of Srivari in Tirumala