Natyam ad

ఆశల ఆందోళన

గాజువాక ముచ్చట్లు:
 
కనీస వేతనాలకై రాష్ట్ర వ్యాప్తంగా ఆశ కార్యకర్తలు చేస్తోన్న ఆందోళనలో భాగంగా విశాఖ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ముట్టడికి పిలుపు నిచ్చిన నేపథ్యంలో ఆయా మండలాల్లో పని చేస్తున్న ఆశ కార్యకర్తలను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు.పెదగంట్యాడ నుంచి బయలుదేరిన ఆశ కార్యకర్తలను న్యూ పోర్ట్ పోలీసులు స్టేషన్ కి తరలించారు.ఈ సందర్భంగా సీఐటీయూ నాయకుడు కొవిరి అప్పలరాజు,ఆశ కార్యకర్తలు ఎన్ హేమలత,జి కుమారి,పి సోమేశ్వరి మాట్లాడుతూ నూతన పీఆర్సీ విధానాన్ని అనుసరించి కనీస వేతనం 15 వేలు చేయాలని డిమాండ్ చేశారు.నెలనెలా ఇచ్చిన జీతాన్ని రెండు దఫాలుగా చెల్లించడం కరెక్ట్ కాదన్నారు.తమను ప్రభుత్వ ఉద్యోగులుగా చూస్తూ సంక్షేమ పథకాలను అందకుండా చేసారని దీనివలన అన్నివిధాలా నష్టపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు.ఆశ కార్యకర్తలకు వారాంతపు సెలవు అమలుచేయాలని కోరారు.
 
Tags: Anxiety of hope