బజాజ్ పల్సర్ షోరూమ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే ద్వారంపూడి
కాకినాడ ముచ్చట్లు:
ప్రస్తుతం స్పీడ్ బైక్స్ ట్రెండ్ నడుస్తోందని., తల్లిదండ్రులు తమ పిల్లలు స్పీడ్ బైక్స్ నడిపేటప్పుడు హెల్మెట్స్ ధరించి, రహదారి భద్రత లు పాటించే విదంగా చర్యలు తీసుకోవాలని కాకినాడ సిటి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పిలుపునిచ్చారు.కాకినాడ కల్పనా సెంటర్లో సాయి మోటార్ ప్లాజా ఆధ్వర్యంలో గోపాల్ ఆటో మోటివ్స్ మైదానం ప్రాంగణంలో బజాజ్ పల్సర్ 2.0 ప్రారంబోత్సవ కార్యక్ర మం జరిగింది. కార్యక్రమానికి ఎస్.ఎం.పి. బజాజ్ మేనేజింగ్ పార్టనర్ చక్కా వెంకటరమణ అధ్యక్షత వహించగా కాకినాడ సిటి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ముఖ్యఅతిధిగా పాల్గొని బజాజ్ పల్సర్ 2.0 ఆవిష్కరించారు. ఈసందర్భంగా చంద్రశేఖరరెడ్డి మీడియాతో మాట్లాడారు. అనంతరం బజాజ్ పల్సర్ బైక్ స్టంటర్స్ ప్రదర్శించిన విన్యాసాలను ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి వీక్షించారు. ఈకార్యక్రమంలో బజాజ్ ఆటో రీజనల్ హెడ్ కరుణాకరణ్, శ్రీనివా -సులురెడ్డి మాట్లాడుతూ వాహన వినియోగదారులకు కావలసిన మోడళ్ళును | అందిస్తూ బజాజ్ ద్విచక్రవాహనాల సంస్థ అగ్రగామీగా నిలిచిందన్నారు. పల్సర్ ద్విచక్రవాహన శక్తి సామర్ధ్యాలు ప్రజలకు తెలియజేసేందుకు ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినటు చెప్పారు.
Tags: Bajaj Pulsar showroom was opened by MLA Dwarampudi