Natyam ad

రోడ్డు ప్రమాదం లో ఎస్సై మృతి

రంగారెడ్డి  ముచ్చట్లు:
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగుడ మున్సిపాలిటీ పరిధిలో ఓ ఆర్ ఆర్ పైన రోడ్డు ప్రమాదం జరిగింది. సిమెంట్ లోడ్ లారీ ని కారు డీ కొంది.  కారు శంషాబాద్ నుండి తుక్కుగుడా వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సబ్ ఇన్స్పెక్టర్ పల్లె రాఘవేందర్ గౌడ్  అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు మహబూబ్ నగర్ లో రైల్వే పోలీస్ స్టేషన్ లో సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నారు. పహడి షరీఫ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
Tags:Essay killed in road accident