ఉమామహేశ్వరరావు తో వసంత వెంకట కృష్ణ ప్రసాద్ భేటీ
ఎన్టీఆర్ జిల్లా ముచ్చట్లు:
గొల్లపూడి పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తో వసంత వెంకట కృష్ణ ప్రసాద్ భేటీ అయ్యారు.వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పార్టీ లో చేరిన తర్వాత మొదటి సారి భేటీ అయ్యారు.రేపు మైలవరం లో నామినేషన్ కార్యక్రమానికి రావాలని ఉమా ను ఆహ్వానించిన వసంత వెంకట కృష్ణ ప్రసాద్.మైలవరం నియోజకవర్గం లో టిడిపి గెలుపుకు కృషి చేస్తానని దేవినేని ఉమా స్పష్టం చేశారు.మా ఇద్దరి మధ్య రాజకీయ వైరం తప్ప వ్యక్తి గత వైరం లేదు.నియోజకవర్గం లో ప్రతి ఒక్కరూ టిడిపి జెండా ఎగురవేసేందుకు కృషి చేయాలని ఇరువురు నేతలు పిలుపునిచ్చారు.రేపు ఉదయం నామినేషన్ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.అధిష్టానం ఆదేశాలనుసారం నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వసంత వెంకట కృష్ణ ప్రసాద్.గతం లో నాకోసం ఇన్చార్జి గా కోమటి సుధాకర్ త్యాగం చేశారు.ఇప్పుడు వసంత కోసం తాను త్యాగం చేశానని ఉమా తెలిపారు.అభద్రతా భావం తో ఉన్న కార్యకర్తలుకు ధైర్యం చెప్పిన నేతలు.ఇద్దరు కలయికతో నియోజకవర్గం లో నూతనోత్సాహం నెలకొంది.
Tags:Vasanta Venkata Krishna Prasad met with Umamaheswara Rao