చిత్తూరు ముచ్చట్లు:
ప్రేమ వివాహం చేసుకున్నామని అయితే మా కుటుంబ సభ్యుల నుండి హాని ఉంది రక్షణ కల్పించాలని చిల్లకూరు పోలీసులను దిశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో యువజంట ఆశ్రయించింది . చిత్తూరు జిల్లా పీలేరు పట్టణానికి చెందిన గేయ శ్రీ చిల్లకూరు గ్రామానికి చెందిన మనోజ్ కుమార్ ఫేస్ బుక్ ద్వారా పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది మేజర్లైన వీరు ఫిబ్రవరి నెలలో పెద్దలకు తెలియకుండా వివాహం చేసుకున్నారు అనంతరం పోలీసులను ఆశ్రయించగా వారి పెద్దలను పిలిపించి మాట్లాడారు అమ్మాయి తల్లిదండ్రులు రెండు నెలల్లో పంపిస్తామని చెప్పి తీసుకువెళ్లి అక్కడ వేరే వారితో వివాహం చేసేందుకు ప్రయత్నిస్తుండడంతో గేయశ్రీ ఇంటి నుండి వచ్చేసి దిశా ఫౌండేషన్ ఆశ్రయించి వివాహం చేసుకున్నారు ఫౌండేషన్ చైర్మన్ అరుణ యువజంటను చిల్లకూరు పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి మేజర్లైన వీరికి కుటుంబం నుంచి ఎటువంటి ఇబ్బందులు ఎదుర కాకుండా రక్షణ కల్పించాలని కోరారు .
Tags;A loving couple approached the police