Natyam ad

చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం

రాజమండ్రి ముచ్చట్లు:

రాజమహేంద్రవరం జైలు నుంచి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బెయిల్‌పై బయటకు రావడంతో రాష్ట్రవ్యాప్తంగా.. ఆయన అభిమానులు సంబురాలు జరుపుకున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్టయిన చంద్రబాబుకు.. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చెయడంపై హర్షం వ్యక్తం చేస్తూ రాజమహేంధ్రవరంలో చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు.అక్రమ అరెస్టులు, కేసులు బనాయించడం తప్పా ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి శూన్యమని టిడిపి ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరీ తెలిపారు.చేయని తప్పుకు బాబును బాధ్యుడిని చేసి కొందరు పైశాచిక ఆనందం పొందుతున్నారని టీడీపీ మద్దతుదారులు మండిపడ్డారు.

 

Post Midle

Tags: Ksheerabhishekam for Chandrababu’s film

Post Midle