Natyam ad

మద్దతు ధర అడిగితే రైతులకు బేడీలు వేసిన ఘనత టీఆర్ఎస్‌దే: భట్టి

ఖమ్మం ముచ్చట్లు:
ముదిగొండ మండలం బాణాపురంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తున్నారు. నిరుద్యోగులు, పెన్షన్ దారులు, రేషన్ కార్డుల కోసం పీపుల్స్ మార్చ్ నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను దిక్కులేని వాళ్లుగా చేసిందన్నారు. మద్దతు ధర అడిగితే రైతులకు బేడీలు వేసిన ఘనత టీఆర్ఎస్‌దేనని భట్టి విమర్శించారు. టీఆర్ఎస్ సర్కార్ అధికారులను మధ్యవర్తులుగా మార్చేసిందన్నారు. రాబోయే ఎన్నికల్లో రైతులు కేసీఆర్‌కు ఉరి వేయడం ఖాయమన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తానన్న కేసీఆర్.. సుబ్రహ్మణ్య స్వామిని ఎలా కలిశారని ప్రశ్నించారు. అసలు ఆయనను కేసీఆర్ ఎందుకు కలిశారో బయట పెట్టాలని భట్టి డిమాండ్ చేశారు.
 
Tags:TRS: Bhatti credits farmers for asking for support price