ఎన్టీటీపిసీలో ప్రమాదం…వ్యక్తి మృతి
ఇబ్రహీంపట్నం ముచ్చట్లు:
డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రం లో ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి చెందాడు. మృతుడు మల్లవరపు సౌరి బాబు కోల్ ప్లాంట్ స్టేజ్ 1 లో కాంట్రాక్ట్ లేబెర్ గా పని చేస్తున్నాడు. ప్రమాదం శనివారం తెల్లవారుజామున సుమారు 4.30 గంటల సమయంలో జరిగింది. రెండు బోగీలు కలిపే సమయం లో జరిగే క్రమం ప్రమాదం జరిగింది. మృతి చెందిన వ్యక్తి ఇబ్రహింపట్నం శక్తి నగర్. మృతిడికి భార్య,కొడుకు,కూతురు వున్నారు.. మృతదేహాన్ని ఏ కాలనీ విటిపిఎస్ హాస్పిటల్ కి తరలించారు.

Tags: Accident in NTTPC…person dies
