కరోనా టెస్టుల సంఖ్య పెంచాం
నూజివీడు ముచ్చట్లు:
కృష్ణాజిల్లా నూజివీడు డిప్యూటీ డిఎంఅండ్ హెచ్ఓ డాక్టర్ ఆశ మీడియతో మాట్లాడారు. ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్న సందర్భంగా టెస్టింగ్ కెపాసిటీ పెంచడం జరిగింది. ఈ మధ్యకాలంలో కేసులు తక్కువగా ఉండటం వల్ల తక్కువ టెస్టులు చేశాము కానీ థర్డ్ వేవ్ దృష్ట్యా ఇప్పుడు పెంచామని అన్నారు. కరోనా కేసులు కూడా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఫారన్ రిటర్న్స్ వచ్చిన వాళ్ళని ఎయిర్ పోర్టులోనే టెస్ట్ నిర్వహిస్తున్నాం. ఒకవేళ పాజిటివ్ వస్తే క్వారంటైన్ కి తరలిస్తున్నారు, ఒకవేళ ఓమిక్రాన్ వేస్తే వెంటనే హాస్పిటల్ కి షిఫ్ట్ చేసి వైద్య సేవలు అందిస్తున్నామని వెల్లడించారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్మోహన్రెడ్డి -ఎంపిపి భాస్కర్రెడ్డి
Tags: Increased number of corona tests