Natyam ad

ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో 27 న జాబ్ మేళా…!

మచిలీపట్నం ముచ్చట్లు:


జిల్లా ఉపాధి కార్యాలయం, ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకుల కోసం ఈ నెల 27వ తేదీ 10  గం టల కి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి రోడ్ లో లేడీ యాంప్తిల్ ప్రభుత్వ కళాశాలలో అవరణ లో నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి దేవరపల్లి విక్టర్ బాబు తెలిపారు. ఈ జాబ్ మేళా లో వరుణ్ మోటార్స్, నవత ట్రాన్స్పోర్ట్, మెడ్ ప్లస్,శ్రీ సిటీ,ఎన్ ఎస్ ఇన్స్ట్రుమెంట్స్ తదితర కంపెనీల ప్రతినిధులు పాల్గొంటునట్లు ఆయన తెలిపారు.అనుభవం ఉన్నవారితో పాటు ఫ్రెషర్స్ కూడా ఈ ఇంటర్వ్యూలకు హాజరుకావొచ్చని అధికారులు తెలిపారు. ఈ జాబ్ మేళాలో పదో తరగతి ఐటిఐ మరియు ఇంటర్,డిగ్రీ,

 

 

 

ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారు హాజరుకావొచ్చు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూ జరిగే ప్రదేశానికి రెజ్యూమ్తో పాటు విద్యార్హత జిరాక్స్ కాపీలు, ఫోటోలు, అనుభవం ఉన్న వారు వాటి సంబంధిత సర్టిఫికేట్లతో హాజరుకావాల్సి ఉంటుంది.అంతేగాక జాబ్ మేళా కు హాజరయ్యే అభ్యర్థులు ఈ క్రింది వెబ్ సైట్ http://www.NCS.Gov.IN
లో రిజిస్టర్ చేసుకోవాలి అని కోరారు.జాబ్ మేళా కి హాజరైన వారికి ఎటువంటి టి.ఏ , డి ఎ లు ఇవ్వబడవు.మరింత సమాచారం కొరకు +91 81424 16211 నెంబరు ను సంప్రదించాలి.

 

Post Midle

Tags: Job fair on 27th under the auspices of employment office…!

Post Midle