దూది ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం
ఏలూరు ముచ్చట్లు:
ఏలూరు జిల్లా దెందులూరు మండలం ముప్పవరం లో దూది ఫ్యాక్టరీ (దారాల తయారీ పరిశ్రమ) దగ్ధం అయింది. గుండుగోలు నుండి భీమడోలు నేషనల్ హైవేలో తిరుమల పాల ఫ్యాక్టరీ దగ్గరలో దూది ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీగా మంటలు చెల రేగడంతో ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పటానికి శ్రమించారు. ఫ్యాక్టరీలోని దూదిని జెసిబి సహాయంతో బయటకు లాగి మంటలను అదుపు చేసారు.
Tags: A fire in a cotton factory

