నీచ సంస్కతితోనే సీఎం జగన్పై దాడి
– దాడిని ఖండించిన వైఎస్సార్సీపీ నాయకులు
పుంగనూరు ముచ్చట్లు:
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డిపై రాళ్లతో దాడి చేసి హత్యాయత్నం చేయడాన్ని ఖండిస్తున్నామని , నీచ సంస్కతితోనే తెలుగుదేశం వారు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి , రాష్ట్ర జానపద కళల సంస్థ చైర్మన్ కొండవీటి నాగభూషణం , మున్సిపల్ చైర్మన్ అలీమ్బాషా, తెలిపారు. ఆదివారం వారు మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో పెద్దిరెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్సీపీకి వస్తున్న ప్రజాధరణ చూసి ఉమ్మడి పార్టీలకు ఇక మనుగడ లేదన్న తలంపుతో పథకం ప్రకారం రాళ్ల దాడి చేయించారని ఆరోపించారు. సిద్ధం బస్సుయాత్రలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై దాడిని ఖండిస్తున్నామన్నారు. గత కొంత కాలంగా చంద్రబాబునాయుడు, లోకేష్, పవన్కళ్యాణ్లు ప్రజలను రెచ్చగొట్టడం, జగన్ను వదిలిపెట్టేది లేదని, కథ చూస్తామంటు బహిరంగంగా టీవి ఛానళ్లకు ఇచ్చారని తెలిపారు. ఇలాంటి రెచ్చగొట్టే ప్రసంగాలతోనే పథకం ప్రకారం జగన్మోహన్రెడ్డిపై హత్యాప్రయత్నం జరిగిందని తెలిపారు. ఇందులో బాధ్యులు ఎవరైన వదిలిపెట్టే ప్రసక్తే లేదని తెలిపారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసిన వైఎస్.జగన్మోహన్రెడ్డికి వస్తున్న ప్రజాధరణను ఎవరు ఆపలేరని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో రెండవ సారి వైఎస్సార్సీపీకి అధికారం ఇచ్చి ఉమ్మడి పార్టీలను ప్రజలు భూస్థాపితం చేయడం ఖాయమని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ అమ్ము, బోయకొండ డైరెక్టర్ రాజేష్, బలిజ సంఘ నాయకురాలు మాధురి, అమ్ముకుట్టి, మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.
Tags; Attack on CM Jagan with low culture