Natyam ad

పుంగనూరులో విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ -చైర్మన్‌ అలీమ్‌బాషా

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని లీనార్డ్ హైస్కూల్‌లో విద్యార్థులకు ట్యాబ్‌లను పంపిణీ చేశారు. శుక్రవారం మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, వార్డు కౌన్సిలర్‌ అర్షద్‌అలీ కలసి ట్యాబ్‌లు పంపిణీ చేశారు. చైర్మన్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అవసరమని గుర్తించి ట్యాబ్‌లు, బైజ్యూస్‌ స్టడీ మెటిరీయల్‌ను ఉచితంగా అందజేయడం అభినందనీయమన్నారు. విద్యార్థులు ట్యాబ్‌ల ద్వారా పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో హచ్‌ఎం ఉషారాణి, ఉపాధ్యాయులు వాణిలక్ష్మీ, జ్యోతితో పాటు వైఎస్సార్‌సీపీ నాయకులు కొండవీటి నరేష్‌, మౌల, అజీజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags: Distribution of tabs to students in Punganur – Chairman Aleembasha

Post Midle