బాధితులను పరామర్శించిన జేసీ
తాడిపత్రి ముచ్చట్లు:
అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని ఆసుపత్రిపాలెంలో నిద్రపోతున్న ఆడవారి మీద పైశాచికంగా పెట్రోల్ పోసి దాడి చేయడం దారుణమని మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు.ఆయన బాధితులను పరామర్శించి వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. బాధితులకు కావాల్సిన సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని భరోసా నిచ్చారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
Tags: JC visited the victims

