అభివృద్ధి చేసి ఓట్లు అడుగుతున్నాం
పుంగనూరు ముచ్చట్లు:
ఏప్రభుత్వాలు చేయని విధంగా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించి ఓట్లు అడగడం రికార్డు సృష్టించడమేనని రాష్ట్ర జానపదకళల సంస్థ చైర్మన్ కొండవీటి నాగభూషణం అన్నారు. ఆదివారం పట్టణంలోని కొత్తయిండ్లు, కొత్తపేట, బిలాల్మసీదువీధి ప్రాంతాలలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ అలీమ్బాషా , జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ అమ్ముతో కలసి కరపత్రాలు పంపిణీ చేసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి వెంకటమిధున్రెడ్డిలకు రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అలాగే మండలంలోని కంగానెల్లూరు గ్రామంలో ఎంపీపీ అక్కిసాని భాస్కర్రెడ్డి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. అలాగే పట్టణంలో కొత్తయిండ్లు, ఎంబిటి రోడ్డు ప్రాంతాలలో లయన్స్ క్లబ్ జిల్లా పీఆర్వో డాక్టర్ శివ, ఆసుపత్రి అభివృద్ధి కమిటి చైర్మన్ డాక్టర్ శరణ్, రెడ్డి జనసంక్షేమ నాయకులు త్రిమూర్తిరెడ్డి, మధుసూదన్రెడ్డి, మహిపాల్రెడ్డి, ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు బాలసుబ్రమణ్యం, పి.ఎల్.శ్రీధర్, విశ్రాంత మిలటరీ ఉద్యోగ సంఘ ప్రతినిధులు కృష్ణప్ప, శ్రీనివాసులు, నానబాలగణేష్, రెడ్డెప్ప, ముస్లిం మైనార్టీల నాయకుడు బిటి.అతావుల్లా లు కలసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో వైస్ చైర్మన్ సిఆర్.లలిత, కౌన్సిలర్లు కొండవీటి కాంతమ్మ, మమత, నరసింహులు, జెపి.యాదవ్, కాళిదాసు, రెడ్డెమ్మ, రేష్మా, రాఘవేంద్ర, జయభారతి, నాయకులు కొండవీటి మాధురి, రమణ, గౌస్, బోయకొండ డైరెక్టర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
Tags: We are asking for votes for development