పుంగనూరులో పాముకాటుతో మహిళ మృతి
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని మేలుపట్లకు చెందిన ప్రకాష్ భార్య ప్రభావతి (55) పాముకాటుకు గురై మంగళవారం మృతి చెందింది. పొలంలో పని చేస్తుండగా పాము కరవడంతో కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు పేర్కొన్నారు. దీంతో ఆకుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Tags: Woman dies of snakebite in Punganur