Natyam ad

పుంగనూరులో 16నఙాతీయ లోక్‌అదాలత్‌

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని కోర్టు ఆవరణంలో ఈనెల 16న జాతీయ లోక్‌అదాలత్‌ను నిర్వహిస్తున్న సీనియర్‌ సివిల్‌జడ్జి వాసుదేవరావు తెలిపారు. గురువారం ఆయన ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌జడ్జి కార్తీక్‌ తో కలసి న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వాసుదేవరావు మాట్లాడుతూ జాతీయ లోక్‌అదాలత్‌లో రాజీకి సరిపడ కేసులను పరిష్కరిస్తామన్నారు. న్యాయవాదులు, అధికారులు ,పోలీసులు అధిక సంఖ్యలో కేసులు పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు గల్లాశివశంకర్‌నాయుడు, న్యాయవాదులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: 16th National Lok Adalat in Punganur

Post Midle