పుంగనూరులో సంక్షేమము, అభివృద్ధి రెండు కళ్ళు
పుంగనూరు ముచ్చట్లు:
రాష్ట్రంలో అభివృద్ధి , సంక్షేమం రెండు కళ్ళుగా భావించి ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని మున్సిపల్ చైర్మన్ అలీమ్బాషా అన్నారు. గురువారం పట్టణంలో మా నమ్మకం నువ్వే జగన్…మా భవిష్యత్తు జగనన్నే కార్యక్రమాన్ని చైర్మన్ అలీమ్బాషా, కౌన్సిలర్ రేష్మా కుమ్మరవీధిలో నిర్వహించారు. అలాగే రహమత్నగర్లో మైనార్టీ సెల్ సీమజిల్లాల ఇన్చార్జ్ ఫకృద్ధిన్షరీఫ్, కౌన్సిలర్ సాజిదాబేగం నిర్వహించారు. గోకుల్వీధిలో జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ అమ్ము, రాజేష్ నిర్వహించారు. కొత్తపేటలో కౌన్సిలర్ భారతి, మేలుపట్లలో వైస్ చైర్మన్ లలిత నిర్వహించారు. అలాగే కౌన్సిలర్లు నటరాజ, జెపి.యాదవ్, నరసింహులు, కిజర్ఖాన్, రాఘవేంద్ర , సుప్రియ, ఆదిలక్ష్మీ లు తమ వార్డులలో పర్యటించారు. కరపత్రాలు పంపిణీ చేసి , స్టిక్కర్లు అంటించారు. ప్రశ్నలకు సమాధానాలు సేకరించి , ముఖ్యమంత్రి సెల్కు మిస్డ్కాల్ ఇప్పించారు.
Tags; Welfare and development are two eyes in Punganur