Natyam ad

పుంగనూరులో మహాలక్ష్మీ అలంకారంలో అమ్మవార్లు

పుంగనూరు ముచ్చట్లు:

నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మంగళవారం మూడవ రోజు పలు ఆలయాల్లో విశేష పూజలు నిర్వహించారు. పట్టణంలోని శ్రీకళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఇన్‌స్పెక్టర్‌ మునీంద్రబాబు ఆధ్వర్యంలో శ్రీ అష్టలక్ష్మీ అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి , పూజలు నిర్వహించారు. అలాగే శ్రీబోగనంజుండే శ్వరస్వామి ఆలయంలో పార్వతిదేవిని వివిధ పుష్పాలతో , పట్టుచీరలు కట్టి మహాలక్ష్మీ అలంకారం చేశారు. శ్రీవిరూపాక్షి మారెమ్మ ఆలయంలో అమ్మవారిని పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. శ్రీచాముండేశ్వరి ఆలయంలో అమ్మవారిని, శ్రీవాసవికన్యకాపరమేశ్వరిదేవిని ప్రత్యేకంగా అలంకరించి, పూజలు చేశారు. ఆలయాల్లో హ్గమాలు నిర్వహించి, అభిషేకాలు చేసి, తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

Post Midle

Tags: Ammavars in Punganur in Mahalakshmi Alankaram

Post Midle